హోటల్స్‌లో పిల్లి బిర్యానీ.. మస్త్ గిరాకీ

హోటల్స్‌లో పిల్లి బిర్యానీ.. మస్త్ గిరాకీ

ఏమండీ కోడి మాంసం.. మేక మాంసం తినగా లేంది.. పిల్లి మాంసం తింటే ఏమవుతుందని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పడం కష్టమేమో. విశాఖ జిల్లాలో పిల్లులను అపహరించి వాటి మాంసాన్ని హోటళ్లకు, బిర్యానీ పాయింట్లకు విక్రయిస్తోంది ఓ ముఠా. హోటల్ యజమానులు తక్కువ ధరకు వస్తున్న ఈ పిల్లి మాంసాన్ని కొని చికెన్, మటన్ బిర్యానీలో కలుపుతున్నారు. దేవుళ్ల చిత్రాలను వాహనాల్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ పిల్లులు ఉండే ప్రాంతాల్ని చూసుకుని అక్కడ దిగుతారు. వాటిని పట్టుకుని వధిస్తారు. ఆ మాంసాన్ని హోటల్స్‌కి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ గమనించింది. సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పిల్లి మాంసం ముఠాను గుట్టు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులున్న ఆ ముఠాను అరెస్ట్ చేశారు. పోలీసులు వారు నడిపే వాహనాన్ని తనిఖీ చేయగా బ్రతికున్న ఒక పిల్లితో పాటు చనిపోయిన మరో పిల్లిని గుర్తించారు. ముఠాలోని సభ్యులను గుంటూరులోని బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వారిగా గుర్తించి విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story