మోదీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ పథకాలు అమలు- పురందేశ్వరి

మోదీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ పథకాలు అమలు- పురందేశ్వరి

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంఖానాదం కార్యక్రమంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. మహిళల కోసం మోదీ ఒక అన్నగా ముందు నిలిచాడని తెలిపారు. మహిళల గౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారని అన్నారు. నాడు కొంత మంది అవహేళన చేశారని విమర్శించారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణుల కోసం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారని పురందేశ్వరి అన్నారు.

Next Story