AP: ఆకట్టుకుంటున్న ఎడ్ల పందేలు

AP: ఆకట్టుకుంటున్న ఎడ్ల పందేలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఎడ్ల పందాలు ఆకట్టుకున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లంవారిపాలెంలో జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగాయి. యువకులు, పెద్దల కేరింతలు మధ్య పోటీలు హోరాహోరీగా సాగాయి. ఒంగోలు జాతి ఎడ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్ లో అంతర్ రాష్ట్ర ఎద్దుల గిరక పోటీలు కోలాహలంగా జరిగాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో పొట్టేల పందేలు జరిగాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేలా నిర్వాహకులు ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.

Next Story