By - Sathwik |26 Oct 2023 12:00 AM GMT
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ నటుడు మురళీ మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుతో అందరి గుండెల్లో బాధ ఉందని, ఇదే తమిళనాడు, కర్ణాటకలో జరిగితే ప్రజలు భగ్గుమనేవారని అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో మరళీమోహన్ అధ్యక్షతన "చంద్రబాబుగారితో మనం" పేరుతో జరిగిన కార్యక్రమంలో పలువురు దర్శకులు , సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన వారు తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఎప్పుడూ మరవలేమని తెలిపారు. ఈ నెల 29న గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించే కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com