పోలవరం పరిస్థితిపై మండిపడ్డ ధూళిపాళ నరేంద్ర

పోలవరం పరిస్థితిపై మండిపడ్డ ధూళిపాళ నరేంద్ర

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమీషన్ల కక్కర్తి, స్వార్థం కోసం సీఎం జగన్ పోలవరాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే.. నాలుగున్నరేళ్లుగా తేదీలు మార్చడం తప్ప జగన్, ఆయన మంత్రులు చేసింది శూన్యమన్నారు. అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షనేతగా దుష్ప్రచారం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి కమీషన్ల కోసం పోలవరం పనులు కట్టబెట్టారని మండిపడ్డారు. కమీషన్లు రావనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

Next Story