By - Chitralekha |29 July 2023 9:04 AM GMT
పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. కుక్కునూరు మండలం రాచకుంట వద్ద వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై మహిళలు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన బాధితులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. పునరావస కేంద్రంలో సౌకర్యాలు లేవని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని అవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే బాలరాజుతో వాగ్వావాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com