By - Vijayanand |4 Aug 2023 10:33 AM GMT
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి ఎనిమిది లక్షల రూపాయలను దుండగులు ఎత్తుకెళ్లారు. మృతుడు సూర్యాపేటకు చెందిన వారణాసి లింగయ్యగా గుర్తించారు. వరి నాట్లు వేసే గుత్తేదారు అయిన లింగయ్యను డబ్బుల కోసమే హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనాస్ధలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లతో పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com