జగన్ పాలనపై కన్నా ఆగ్రహం

జగన్ పాలనపై కన్నా ఆగ్రహం

సీఎం జగన్ పాలన తీరుపై మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా నూతలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా.. మోసం చేయడమే జగన్ నైజమన్నారు. సంపద దోచుకోవడమే జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. 175 సీట్లను దొడ్డి దారిన గెలవాలని చూస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు కన్నా లక్ష్మీనారాయణ.

Next Story