By - Sathwik |24 April 2024 5:30 AM GMT
కురువ కులస్తులకు రాజకీయంగా పదవులు కేటాయించిన తెలుగు దేశం పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం నాయకులు ప్రకటించారు. కర్నూలులో కురువ సంఘం నేతలతో ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు సమావేశం అయ్యారు.తమ కులానికి ఇచ్చిన హామీ మేరకు 2ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలను తెదేపా అధినేత చంద్రబాబు కేటాయించారన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని హమీ ఇచ్చారు.రాష్ట్రంలోని బీసీలందరు ఏకమై వైకాపాను గద్దె దించాలని బోరంపల్లి ఆంజినేయులు పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com