వైసీపీకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గుడ్‌బై

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గుడ్‌బై

సీఎం జగన్‌కు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు షాక్ ఇచ్చారు. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈనెల 20న జనసేన అధినేత పవన్ సమక్షంలో ఆపార్టీలోకి చేరనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్‌బాబు.. ఆపార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు వైసీపీలో గుర్తింపులేదని ఆరోపించారు. జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానన్న పంచకర్ల.. పెందుర్తి నుంచి పోటీ చేస్తానన్నది తన వ్యక్తిగతమన్నారు.


Next Story