By - Sathwik |12 March 2024 2:45 AM GMT
మేదరమెట్ల వైసీపీ సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా?అని ప్రశ్నించారు.
డ్రోన్ చిత్రాలు, గ్రీన్ మ్యాట్తో దొరికిపోయారని.. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫొటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్కు ప్రజల మద్దతు లేదని.. ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేశ్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com