నారా లోకేశ్ ప్రారంభించిన కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 208రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగి 2852.4 కిలో మీటర్ల మేర పూర్తయింది. ఇప్పటివరకు 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. 208రోజుల పాదయాత్రలో యువనేత లోకేష్కు 4 వేలకు పైగా వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. యువగళం పాదయాత్రలో కోటిమంది ప్రజలు యువనేతతో వివిధ మార్గాల్లో అనుసంధానమయ్యారు. ప్రతిజిల్లాలోనూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న స్పందన తట్టుకోలేక అధికార పక్షం పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగింది. లోకేష్తో పాటు స్థానిక నేతలపైనా పోలీసులు అనేక కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లు జెలుకెళ్లారు. వాటన్నింటిని అధిగమించిన లోకేష్ యాత్రను విజయవంతంగా కొనసాగించారు. ఇప్పుడు విరామం తర్వాత సైతం మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి... వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com