By - Vijayanand |1 Sep 2023 6:03 AM GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వస్తుందంటే ఆయన అభిమానులకు పెద్ద పండగే. నెల్లూరుకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు తమ నాయకుడికి పుట్టినరోజు కానుకగా అపూరపమైన బహుమతి ఒకటి ఇచ్చారు. 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని తీర్చిదిద్దారు. నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఈ కళాకృతిని తయారు చేయించారు. 470 కేజీల వెండి పట్టీలు, మువ్వలతో చిరునవ్వులు చిందిస్తోన్న పవన్ కల్యాణ్ ముఖచిత్రాన్ని రూపొందించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com