Srikakulam: రావులవలసలో అధ్వాన్నంగా రోడ్లు

Srikakulam: రావులవలసలో అధ్వాన్నంగా రోడ్లు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలసలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. నాలుగేళ్లుగా.. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్గంలో వెళ్లాలంటే.. భయపడిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతులతో ఈ మార్గం అస్తవ్యస్థంగా తయారైందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేస్తానన్న సీఎం జగన్ హామీ హామీగానే మిలిగిపోయిందన్నారు. ఈ మార్గంలో వెళ్లేందుకు పిల్లలు, గర్బిణీలు తీవ్ర అవస్తలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story