By - Bhoopathi |10 July 2023 5:15 AM GMT
లష్కర్ బోనాల్లో ప్రధాన ఘట్టమైన రంగం భక్తుల్ని విశేషంగా ఆకట్టుంది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో భవిష్యవాణి వినిపించి ఎలాంటి లోపాలు లేకుండా పూజలు అందుకున్నానని అన్నారు. ఐతే గతేడాది వాగ్దానం చేసినవి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. వర్షాలు కురుస్తూనే ఉంటాయని అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయన్నారు. లష్కర్ బోనాల్లో అమ్మవారిని లక్షలాది మంది దర్శించుకున్నారని మంత్రి తలసాని అన్నారు. అమ్మవారికి ఉత్సవం వైభవంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయ్యాయని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com