By - Chitralekha |27 July 2023 10:54 AM GMT
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. కమ్మర్ పల్లి స్టేషన్తో పాటు సమీప కాలనీలను వరద ముంచెత్తింది. క్రమంగా నీటిమట్టం పెరగడంతో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో ఆర్మూర్-జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com