TSPSC: తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు మళ్లీ వాయిదా

TSPSC: తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు మళ్లీ వాయిదా

తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. నవంబరు 2, 3న జరగాల్సిన గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత జనవరి 6, 7న గ్రూప్ టూ నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం... 5 లక్షల 51 వేల 901 మంది దరఖాస్తు చేశారు. ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను.. ఇతర పోటీ, గురుకుల నియామక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని... నవంబరు 2, 3కి వాయిదా వేశారు. నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున గ్రూప్ టూ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని... TSPSC సమావేశంలో నిర్ణయించారు. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉంటుంది కాబట్టి.. పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు.

Next Story