కర్నూలు జిల్లాలో తుంగభద్ర డ్యాం అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు జిల్లాలో తుంగభద్ర డ్యాం అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ నీటి విడుదలలో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. డ్యాం నుంచి దిగువ కాలువకు నీటిని విడుదల చేయడంతో పంటలు నీటమునిగాయి. కోడుమూరు మండలం ప్యాలకుర్తి సమీపంలో దిగువ కాలువ కింద రైతులు దాదాపు వంద ఎకరాల్లో మిరప, పత్తి పంటలు వేశారు. పంటలు ఏపుగా రావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. అయితే తుంగభద్ర అధికారులు అనాలోచితంగా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తలలు పట్టుకున్నారు. తమ పంటపొలాలను కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు.

Next Story