By - Bhoopathi |22 Jun 2023 8:45 AM GMT
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రాతిబావ వంక గ్రామంలో భూకబ్జా చేశారు. సర్వేనంబర్ 61లో ఉన్న స్మశాన వాటిక భూమిని వైసీపీ ఎంపీటీసీతో పాటు పోలీసులు కుమ్మక్కై స్థలాన్ని కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సర్వేయర్... సర్వే చేస్తుండగా వైసీపీనేతలు, పోలీసులు కలిసి సర్వే రాళ్లను తొలగించారు. నేతలతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 70 ఏళ్ల నుంచి ఇది స్మశాన వాటిగా ఉందని, వైసీపీ నేతలు కబ్జా చేయకుండా అరికట్టాంటూ ఎమ్మార్వోకు వినతపత్రం ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com