శంభుని రెడ్లను ఎస్సీల జాబితాలోకి చేర్చుతానన్న వైసీపీ ఎమ్మెల్యే

శంభుని రెడ్లను ఎస్సీల జాబితాలోకి చేర్చుతానన్న వైసీపీ ఎమ్మెల్యే

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా శంభుని రెడ్లను ఎస్సీలో చేర్పిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శంభునిరెడ్ల కులస్తులు వారి వాగ్దానాన్ని గుర్తు చేశారు. శంభుని రెడ్ల కులస్తును ఎస్సీ కేటగిరీలో చేర్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎస్సీలో కలిపేందుకు న్యాయం చేస్తానని మీడియా ముఖంగా అనడంతో సమస్య మొదలైంది. దీంతో దళిత సంఘాలు ఉద్యమబాట పట్టాయి.

Next Story