Suicide : భార్యతో గొడవ.. బంధువు ఇంట్లో సూసైడ్

Suicide : భార్యతో గొడవ.. బంధువు ఇంట్లో సూసైడ్

భార్యతో గొడవ పడిన భర్త.. బంధువు ఇంట్లోసూసైడ్ చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎస్.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన రక్తని స్వామి (37) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇతను భార్య భవితతో కలిసి ఘట్ కేసర్ మండలం అవుషాపూర్ లో ఉంటున్నాడు. స్వామికి దగ్గర బంధువులైన ముఖేశ్, దీపిక దంపతులు అదే ఊర్లో ఉంటున్నారు.

ముఖేశ్రంగారెడ్డి జిల్లా ఇబ్ర హీంపట్నంలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ వారానికి ఒకసారిఇంటికి వచ్చి వెళ్తుంటాడు. దీపిక తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగొచ్చిన స్వామి భార్య భవితతో గొడవపడ్డాడు. తర్వాత ముఖేష్ ఇంటికి చేరుకు న్నాడు. అక్కడి వంట గదిలో ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం నిద్ర లేచిన దీపిక వంటగదిలోకి వెళ్లి చూసేసరికి స్వామి చనిపోయి ఉన్నాడు. వెంటనే ఇబ్రహీంపట్నంలో ఉన్న భర్త ముఖేశ్ కు ఫోన్చేసి చెప్పింది.

వెంటనే ఇంటికి చేరుకున్న ముఖేష్ ఘట్ కేసర్ పోలీసులకు, మృతుని భార్య భవితకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భవిత.. తన భర్త స్వామికి దీపికతో వివాహేతర సంబంధం ఉందని, ఆమెనే తన భర్తను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పోలీసులు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story