MLA రాజయ్య, సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం

MLA రాజయ్య, సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ MLA రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిమెంట్ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్య, మరో నలుగురిపై ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌లో సర్పంచ్ నవ్య ఫిర్యాదు చేశారు. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అదే సమయంలో గ్రామాభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు తన నిధుల నుండి ఇస్తానని ఎమ్మెల్యే హామీ కూడా ఇచ్చారు.

ఇక ఇదే విషయంపై మరోసారి వీరి మధ్య వివాదం చెలరేగింది. నిధులు ఇవ్వలేదని, పైగా తాను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోందని నవ్య ఆరోపించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై నవ్య భర్త ప్రవీణ్... ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో గ్రామాభివృద్ధికి 25 లక్షలు ఇస్తామని, మరో 20 లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని రాజయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు అడిగితే ఎమ్మెల్యే అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు నవ్య చెప్పారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలన్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకుంటే పోలీస్ కమిషనర్ వద్దకు, మహిళా కమిషన్ వద్దకు వెళ్తానని నవ్య హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story