TS : సచివాలయం ముందు రాజీవ్ భారీ విగ్రహం.. రచ్చ చేస్తున్న బీఆర్ఎస్

TS : సచివాలయం ముందు రాజీవ్ భారీ విగ్రహం.. రచ్చ చేస్తున్న బీఆర్ఎస్

తెలంగాణలో (Telangana) పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వెంటనే శంకుస్థాపన కూడా చేసేశారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి గారి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని.. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందని రేవంత్ రెడ్డి శంకుస్థాపన సందర్భంగా అన్నారు.

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ.. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేసుకున్నారు. రేవంత్ నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడింది. సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం అని అన్నారు. అక్కడ కేసీఆర్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ నేతలు భావించారు.

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ఎందుకు లేటయ్యిందంటే..

సెక్రటేరియట్ నిర్మాణం చివరి దశకు వచ్చినప్పుడు తెలుగు తల్లి ఫ్రైఓవర్ దగ్గర ఉండాల్సిన తెలుగు తల్లి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తీసేశారు. తెలుగు తల్లి విగ్రహం ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్న కేసీఆర్.. ఇప్పుడు తాను ఎంతో ఇష్టపడి కట్టించిన సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం కొలువు అవుతుండటం చూసి కుమిలిపోతున్నారంటూ కాంగ్రెస్ వర్గాలు జోకులు వేసుకుంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story