కరోనా ఎఫెక్ట్ : మేడారంలో సమ్మక్క-సారక్క గుడి మూసివేత..!
By - TV5 Digital Team |28 Feb 2021 12:30 PM GMT
ఇటీవల నిర్వహించిన మేడారం మినీ జాతర సమయంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది.
కరోనా ఎఫెక్ట్ కారణంగా మేడారం ఆలయాన్ని రేపటి నుంచి 21 రోజుల పాటు మూసివేయనున్నారు. ఇటీవల నిర్వహించిన మేడారం మినీ జాతర సమయంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. దీనితో ఆలయాన్నీ పరిశుభ్రం చేసి తాత్కాలికంగా మూసివేయనున్నారు. మేడారం లో సమ్మక్క – సారలమ్మ గుడిని సోమవారం నుండి మూసి వేస్తున్నట్లుగా చర్చల అనంతరం వన దేవతల పూజారులు ప్రకటించారు. వన దేవతలను దర్శించుకునేందుకు రేపటి నుండి భక్తులు మేడారంకు రావద్దని కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com