ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

తెలంగాణలో ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.. ఉపఎన్నిక పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌ శాతం కూడా భారీగానే నమోదైంది.. సాయంత్రం 5 గంటల సమయంలో 80 శాతం ఓటింగ్‌ దాటగా.. చివరి గంటలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఆ తర్వాత గంటపాటు వృద్ధులు, కరోనా పేషెంట్లు ఓటు వేశారు. కరోనా పేషెంట్లు అంబులెన్స్‌ల్లో వచ్చి పీపీఈ కిట్లు ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story