Yadadri: రోడ్డు పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం..
By - Divya Reddy |6 March 2022 2:17 PM GMT
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాయగిరికి చెందిన అంకర్ల లక్ష్మీ, ఊరేళ్ల శ్యామ్, లావణ్య, కవితగా గుర్తించారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆర్టీసీ బస్సు.. వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com