Temple : ఈ గుడికి వెళ్తే.. పెళ్లి అవుతుందట.. అప్పులు తీరుతాయట..

Temple : ఈ గుడికి వెళ్తే.. పెళ్లి అవుతుందట.. అప్పులు తీరుతాయట..

మనుషులు వారి నమ్మకాలకు కొదువే ఉండదు. కొలమానం ఉండదు. ఎందుకంటేొ ఆ నమ్మకం వారిలో కాన్ఫిడెన్స్ పెంచి పనులు అయ్యేట్టు చేస్తుంది. కొన్ని గ్రామాల్లో దేవాలయాలు చాలా ప్రసిద్ది చెంది ఉంటాయి. ఈ ఆలయానికి వెళ్తే కాశీకి వెళ్తే వచ్చేంత పుణ్యం వస్తుంది అంటారు భక్తులు. ఈ ప్రాచీన ఆలయం కరీంనగర్ లో ఉంది. 1200 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన ఈ గుడి పేరే గౌరీ శంకర్ దేవాలయం.

ఇక్కడికి పెళ్లి కానీ యువతి, యువకులు చక్కెర పొడి తో కన్యక పశుపతి, వర పశుపతి పూజలు చేస్తే వారికి తొందరలోనే వివాహం జరుగుతుంది అని నమ్ముతారట. తూర్పు భాగంలో సూర్యుడు, ఆగ్నేయంలో అయ్యప్ప స్వామి, దక్షిణ భాగంలో వీరభద్రుడు, కాలభైరవుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇక నైరుతి భాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు. పశ్చిమాన సరస్వతి దేవీ అమ్మవార్లు ఉండడం విశిష్టత.

ఈ గుడిలో కుబేర పశుపతి అభిషేకం చేస్తే అప్పులు త్వరగా తొలిగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఆయురారోగ్యాలతో ఉండాలంటే శివునికి అభిషేకం చేసిన నీళ్లతో స్నానం చేయాలని నమ్ముతారు భక్తులు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి అత్యంత అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శివరాత్రి రోజు శివుడికి శివ కళ్యాణం, అలాగే రోజు జరిగే కైకర్యాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సోమవారం ఇక్కడ వైభవంగా అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలాది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివస్తారు.

Tags

Read MoreRead Less
Next Story