వరంగల్ కాంగ్రెస్ మీటింగ్లో రచ్చ రచ్చ..చెప్పులు, పిడిగుద్దులతో దాడి
By - Subba Reddy |31 May 2023 10:00 AM GMT
కొండా మురళి, సురేఖ.. ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది
వరంగల్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చ రచ్చ అయ్యింది. కొండా మురళి, సురేఖ.. ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారంలో గందరగోళం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గ్రూప్ రాజకీయాలు స్పష్టంగా కన్పించాయి. రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం తన్నుకున్నారు. గొడవకు దిగిన కార్యకర్తల అంతుచూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ అధ్యక్షురాలు, పీసీసీ సభ్యుల సాక్షిగా.. చెప్పులు.. పిడిగుద్దులతో పరస్పరం కార్యకర్తలు దాడి చేసుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com