TS : గొర్రెల స్కాం.. రంగారెడ్డిలో ఇద్దరు అధికారులు అరెస్ట్

TS : గొర్రెల స్కాం.. రంగారెడ్డిలో ఇద్దరు అధికారులు అరెస్ట్

తెలంగాణలో (Telangana) కేసీఆర్ (KCR) హయాంలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం ఓ పెద్ద సంచలనం. ఈ కేసుకు సంబంధించి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో DV & AHO జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంజిలప్ప, AH డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి కృష్ణయ్యలను అరెస్ట్ చేశారు.

గొర్రెల పంపిణీ స్కీమ్ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రైవేటు వ్యక్తులు అనుచిత ప్రయోజనాలను పొంది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా చేశారని విచారణలో తేలింది. రూ.2.10 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని అధికారులు చెబుతున్నారు. గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి జారీ చేసిన అన్ని సూచనలను వారు ఉల్లంఘించి, కొనుగోళ్ల ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వ్యక్తులను చేర్చుకున్నారు.

నిందితులిద్దరూ ప్రైవేట్ వ్యక్తుల ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు అనుమతించారు. ఫారాలను కూడా ప్రైవేట్‌ వ్యక్తులతో నింపారు. నకిలీ విక్రయదారుల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో, సేకరణ ప్రదేశంలో అప్‌లోడ్ చేశారు. దుర్మార్గపు ఉద్దేశ్యంతో, ఇద్దరూ ఉద్దేశపూర్వకంగా నకిలీ విక్రయదారుల వివరాలను వారికి డబ్బు పంపిణీ కోసం కలెక్టర్‌కు పంపారు. దీంతో.. అసలు డీలర్లకు బదులు నకిలీ అమ్మకందారులకే డబ్బులు వచ్చాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆదేశాల మేరకు ప్రొక్యూర్‌మెంట్ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్‌లను అధికారులు ఆదేశించినట్లు విచారణలో తేలడంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story