TS: తెలంగాణ అప్పు రూ. 6లక్షల 71వేల కోట్లు

TS: తెలంగాణ అప్పు రూ.  6లక్షల 71వేల కోట్లు
శాసనసభలో ప్రకటించిన కాంగ్రెస్‌ సర్కార్‌.... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల

తెలంగాణ అప్పులు 6లక్షల 71వేల 757 కోట్లకు చేరాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. 2014లో 72వేల 658 కోట్లు ఉన్న అప్పులు ప్రస్తుతం కార్పొరేషన్ల రుణాలతో కలిపి 6లక్షల 71వేల కోట్లు దాటినట్లు వివరించింది.రుణ భారం కారణంగా తెలంగాణ రెవెన్యూ రాబడుల్లో 34 శాతం అప్పులు, రీపేమెంట్లకే సరిపోతోందని పేర్కొంది.మరో 35 శాతం జీతాలు, పెన్షన్లకే కావాలని గుర్తుచేసింది. అభివృద్ధి, సంక్షేమానికి 31 శాతమే ఉంటుందని పేర్కొంది. గత పదేళ్లలో విద్య, వైద్య రంగాలకు చాలా తక్కువ నిధులు కేటాయించారని తెలిపింది. బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.


ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై.... అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం..గత పదేళ్లలో అప్పులు దాదాపు పదిరెట్లు పెరిగాయని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ ప్రత్యక్ష గ్యారంటీలు, పరోక్షంగా ఇచ్చిన హామీలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6లక్షల 71 వేల 757 కోట్లకు చేరాయని వివరించింది. ఇందులో FRBM కింద తీసుకున్న రుణం 3లక్షల 89వేల 673కోట్లు ఉన్నట్లు పేర్కొంది. కార్పొరేషన్ల అప్పులు లక్షా 27వేల 208 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్ల రుణం 95వేల 462 కోట్లు, ఆయా సంస్థలు చెల్లించాల్సిన అప్పులు 59వేల 414 కోట్లు ఉన్నట్లు వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పు...... 74వేల 590 కోట్లు అని వెల్లడించింది. వాటర్‌ కార్పొరేషన్‌ 14వేల 60 కోట్లు, మిషన్ భగీరథ కింద.. 20వేల 200 కోట్లు రుణాలు తీసుకున్నట్లు తెలిపింది.


బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవ ఖర్చులకు దాదాపు 20 శాతం అంతరం ఉన్నట్లు శ్వేతపత్రం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉండడం సహా .... ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా అధికంగానే ఉందని తెలిపింది. రాష్ట్రం... అప్పుల కుప్పగా మారడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 34 శాతం అప్పులు, రీపేమెంట్లకే సరిపోతోందన్న శ్వేతపత్రం... మరో 35 శాతం జీతాలు, పెన్షన్లకే కావాలని గుర్తుచేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం 31 శాతమే మిగిలిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రోజూవారీ అవసరాల కోసం చేబదుళ్లు తీసుకోవాల్సిన దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తంచేసింది. రాష్ట్రం ప్రస్తుత ఏడాదిలో 90 రోజులు RBI వద్ద చేబదుళ్లు.., ఓవర్‌ డ్రాఫ్ట్‌ వంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటోందని పేర్కొంది. పదేళ్ల క్రితం మిగులు బడ్జెట్‌ స్థాయి నుంచి.. ప్రస్తుతం అప్పులు అనివార్యం అనే స్థితికి చేరుకుందని తెలిపింది. రాష్ట్ర GSDPలో..అప్పుల భారం 36.9 శాతానికి చేరుకుందని వివరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇది 15.7 శాతమే ఉందని గుర్తుచేసింది. FRBM నిబంధనల ప్రకారం...25 శాతం దాటకూడదని పేర్కొంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను కూడా కలిపితే ఇది 36.9 శాతానికి చేరుకుందని పేర్కొంది. కీలకమైన విద్య, వైద్య రంగాలకు గత పదేళ్లలో.... ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ కేటాయింపులు జరిగాయని తెలిపింది. బడ్జెట్‌లో కనీసం 14.7 శాతం మేర విద్యారంగానికి కేటాయించాలనే సంప్రదాయం ఉన్నప్పటికీ తాజా బడ్జెట్‌లో 7.6 శాతం మాత్రమే కేటాయించినట్లు తెలిపింది.


వైద్యరంగానికి జాతీయ సగటు.. 6.2శాతం బడ్జెట్‌ కేటాయింపులు ఉంటే, రాష్ట్రంలో అది 4.2 శాతం మాత్రమే ఉన్నట్లు వివరించింది. గత పదేళ్ల ప్రస్థానాన్ని ఆర్థిక అరాచకత్వంగా . ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతోనే...... శ్వేతపత్రం విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు..కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story