Telangana: కరీంనగర్లో రేవంత్ పాదయాత్ర
By - Subba Reddy |9 March 2023 5:15 AM GMT
రెండ్రోజుల విరామం అనంతరం తిరిగి ప్రారంభం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర.. రెండ్రోజుల విరామం అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఇవాళ కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వరకు యాత్ర ఉండనుంది. సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేలా హాజరవుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, జైరాం రమేష్, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com