REVANTH: వంద రోజుల్లోనే హామీల అమలు

REVANTH: వంద రోజుల్లోనే హామీల అమలు
కేసీఆర్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదు... మల్లారెడ్డి భూ కబ్జాలపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు హామీలను అమలు చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ అనేక బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని.. కానీ పేదవారికి న్యాయం జరగలేదని ఆరోపించారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్దే తప్ప బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు మేడ్చల్‌కు తీసుకొస్తామన్న ఐటీ పార్క్‌ ఏమైందని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జాల ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి..... ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ ఎందుక మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెస్తామన్న రేవంత్‌ మళ్లీ ఇందిరమ్మ పాలనను సాకారం చేస్తామన్నారు.


తెలంగాణలో పేదలు బతికే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నేతలు మేడ్చల్‌కు తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డు విషయంలో కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చినా తరలించలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందజేస్తామని... రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని... కాంగ్రెస్‌ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఇప్పుడు రూ.1200కి చేరిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నించారు. నియోజకవవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి వారికి నిలువ నీడ లేకుండా చేసిండు అని విమర్శించారు. జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం తరలించలేదన్నారు. కేసీఆర్, మల్లారెడ్డి తొడుదొంగల్లా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నారని విమర్శించారు. మేడ్చల్ కు ఐటీ కంపెనీలు తెస్తామన్న హామీని తుంగలో తొక్కారు అని ఆరోపించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకు తరమాలి అని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story