తెలంగాణలో హాలీవుడ్‌ దిగ్గజం వార్నర్‌ బ్రదర్స్‌ పెట్టుబడి

తెలంగాణలో హాలీవుడ్‌ దిగ్గజం వార్నర్‌ బ్రదర్స్‌ పెట్టుబడి
ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ గ్రూప్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది

ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ గ్రూప్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో ఐడీసీ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండ్ర కార్టర్‌తో సమావేశమయ్యారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఇన్నోవేషన్‌పై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు.

హైదరాబాద్‌లో వార్నర్‌ బ్రదర్స్‌ కార్యాలయం ఏర్పాటుతో దేశంతోపాటు నగర మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఐడీసీ.. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ కార్యకలాపాలకు వ్యూహాత్మక హబ్‌గా ఉంటుందని తెలిపారు. ఐడీసీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలో 12 వందల మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వెల్లడించారు. తదుపరి వ్యాపారాభివృద్ధి మేరకు కార్యకలాపాల విస్తరణ ఉంటుందని వివరించారు. తమ మార్కెట్‌ను సుస్థిరం చేసుకునే లక్ష్యంతో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ సీనియర్‌ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్‌ తెలిపారు. వ్యాపారం పెరిగే కొద్దీ మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story