Tollywood: థియేటర్లలో రాజయోగం

Tollywood: థియేటర్లలో రాజయోగం
ఇయర్ వీకెండ్ లో సందడి చేయనున్న రాజయోగం సాయి రోనక్ హిరోగా తెరకెక్కిన సినిమా

Tollywood: థియేటర్లలో రాజయోగం


ఇయర్ ఎండింగ్ వచ్చేస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి పెరిగింది. ఎలాగో కొత్త ఏడాదిలో పెద్ద ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని సినిమాలు బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి మనముందుకొస్తోంది రాజయోగం.


ఫుల్ రొమాంటిక్ కామెడీ కథతో రాబోతున్న ఈ చిత్రంలో సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ నవ బాల క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై మణి లక్ష్మణ్ రావు నిర్మించగా, రామ్ గణపతి దర్శకుడిగా వ్యవహరించారు. ఇక రీసెంట్ గా ఈ టీజర్‌ను యంగ్ హీరో విశ్వక్ సేన్ రీలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది.


అంతేకాకుండా ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన 'చూడు చూడు' అనే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు వచ్చే బ్యాంగ్, క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ తోపాటు, అనుహ్యంగా వచ్చే టర్న్స్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తాయట. అంతేకాకుండా ఇందులోని క్యారెక్టర్స్ ఎవ్వరూ ఊహించని విధంగా డైరెక్ట్ చేశాడట రామ్ గణపతి.


తుదిమెరుగులు దిద్దుకుని రెడీగా ఉన్న రాజయోగం డిసెంబర్ 30వ తేదీన థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా సాంతం రెండు గంటల పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story