ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి
ఇక్కడ రహదారులు అధ్వాన్నంగా ఉండడం ప్రమాదాలకు మూలం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సెంట్రల్ మాలిలో మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా బస్సును లారీ ఢీకొనడంతో 41 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. ఫ్రెంచ్ కాలనీలో ఇటువంటి ప్రమాదాలు సర్వ సాధారణం. ఇక్కడ రహదారులు అధ్వాన్నంగా ఉండడం ప్రమాదాలకు మూలం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సెగో పట్టణానికి సమీపంలో వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్తున్న లారీని ప్యాసింజర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక శిశువు కూడా ఉన్నారని రవాణా మంత్రి డెంబెలే తెలిపారు.

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తి "భారీ వర్షం కారణంగా బస్సు డ్రైవర్‌కు రహదారి సరిగా కనిపించలేదని చెప్పాడు. బస్సును సకాలంలో బ్రేక్ చేయడంలో విఫలమయ్యాడు అని తెలిపారు. ఈ సంఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని రవాణా మంత్రి తెలిపారు. "అల్లా మరణించిన వారి ఆత్మలను స్వర్గానికి స్వాగతిస్తాడు" అని ఆయన అన్నారు.

దాదాపు 20 మిలియన్ల జనాభా ఉన్న భూభాగంలోని సహెల్ దేశంలో ప్రజలు, వస్తువుల రవాణాకు ఇప్పటికీ ఈ రహదారే ప్రధాన మార్గంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story