Guinea: గినియా రాజధాని కొనక్రి ప్రధాన ఇంధన డిపో పేలుడు 11 మంది మృతి

Guinea: గినియా  రాజధాని కొనక్రి ప్రధాన ఇంధన డిపో పేలుడు 11 మంది మృతి
88 మందికి గాయాలు

గినియా దేశ రాజధాని కొనక్రిలో ప్రధాన ఇంధన డిపో పేలింది. ఈ ప్రమాదం 11 మంది మరణించినట్లు, పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అత్యవసర సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రధాన పెట్రోల్‌ డిపో పేలడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం కావడంతో ప్రధాన కార్యాలయాలన్ని అదే ప్రాంతంలో ఉన్నట్లు చెప్పారు. పేలుడుతో పరిసరాలన్ని తీవ్రమైన పొగతో నిండిపోయాయి. నగరంలోకి నిత్యవసర సేవల వాహానాలు మినహా మిగిళిన వాటిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలందర్నీ ఇంట్లోనే ఉండాలని కోరారు.

పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రధాన చమురు టెర్మినల్ వద్ద జరిగిన పేలుడు.. కానక్రీ నగరంలోని కలూమ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్‌ను కుదిపేసింది. సమీపంలోని అనేక ఇళ్ల కిటికీలను పేల్చివేసి వందలాది మంది ప్రజలు పారిపోయేలా చేసింది. పేలుడు తర్వాత కనీసం 11 మంది మరణించారు..88మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారీ మంటలు, నల్లటి పొగ మైళ్ల దూరం నుండి కనిపించింది. గినియా చమురు ఉత్పత్తి చేసే దేశం కాదని, దానికి చమురు శుద్ధి చేసే సామర్థ్యం లేదు. ఇది శుద్ధి చేసిన ఉత్పత్తులను దిగుమతి చేస్తుంది. ఇవి ఎక్కువగా కలూమ్ టెర్మినల్‌లో నిల్వ చేయబడతాయి. దేశవ్యాప్తంగా ట్రక్కుల ద్వారా పంపిణీ చేయబడతాయి. టెర్మినల్‌కు ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.


దేశం కొనాక్రీకి ఉత్తరాన ఉన్న కంసర్ వద్ద ఓడరేవులో ఒక చిన్న చమురు గిడ్డంగిని కలిగి ఉంది. దీనిని ఎక్కువగా మైనింగ్ సంస్థలు ఉపయోగిస్తాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత కూడా దట్టమైన పొగలు, కొన్ని మంటలు కనిపించాయని.. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కారణం, బాధ్యులు ఎవరో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించబడుతుంది. ఈ సంఘటనపై ప్రభుత్వం తన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుందని, దీని స్థాయి, పరిణామాలు జనాభాపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ప్రకటన పేర్కొంది

Tags

Read MoreRead Less
Next Story