Mumbai Blast: ముంబై పేలుళ్ల సూత్రధారి భుట్టావి మృతి

Mumbai Blast: ముంబై పేలుళ్ల సూత్రధారి భుట్టావి మృతి
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరణ

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ పంజాబ్ ప్రావిన్సులో పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలో ఉన్నపుడు గత ఏడాది మే నెలలో గుండెపోటుతో మరణించాడని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరించింది. భుట్టవీ హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా పనిచేశారు.

ముంబయి దాడుల్లో 166 మంది మరణించగా, మరో 300 మంది గాయపడ్డారు. హఫీజ్ ను అప్పగించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ముంబయి ఉగ్రదాడుల తర్వాత హఫీజ్ సయీద్‌ను నిర్బంధించిన కాలంలో భుట్టవీ గ్రూప్ రోజువారీ కార్యక్రమాల బాధ్యతలను తీసుకున్నారని సమాచారం. 2009వ సంవత్సరం జూన్ నెలలో హఫీజ్ సయీద్ పాకిస్థాన్ అధికారుల నిర్బంధం నుంచి విడుదలయ్యాడు.

ప్రస్తుతం ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్ దేశంలో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో లష్కరే తోయిబా సంస్థాగత స్థావరానికి భుట్టవీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

డిసెంబరు 2008లో భద్రతా మండలి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించబడిన సయీద్ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్నాడు. 12 ఫిబ్రవరి 2020 నుండి 78 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఏడు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలాడని ఆంక్షల కమిటీ సవరించిన ఎంట్రీలో పేర్కొంది. 2023 డిసెంబర్‌లో, ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని భారతదేశం పాకిస్తాన్‌ను కోరింది. అతను అనేక ఉగ్రవాద కేసుల్లో భారత దర్యాప్తు సంస్థలకు కావలసిన వ్యక్తి. భద్రతా మండలి కమిటీ ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధం మరియు ఆయుధాల ఆంక్షలకు లోబడి వ్యక్తులు మరియు సంస్థల యొక్క అల్-ఖైదా ఆంక్షల జాబితాలోని కొన్ని నమోదులకు సవరణలు చేసింది.

ఈ సవరణల ప్రకారం, లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపక సభ్యుడు మరియు సయీద్ డిప్యూటీ హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావి మరణించినట్లు ధృవీకరించబడిందని కూడా ఆంక్షల కమిటీ గుర్తించింది.2008 ముంబై ఉగ్రదాడి కోసం శిక్షణ ఇచ్చిన భుట్టావి, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చినందుకు శిక్ష అనుభవిస్తూ గత ఏడాది మేలో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జైలులో మరణించాడు.

Tags

Read MoreRead Less
Next Story