ఫిలిప్పీన్స్(Philippines )లో ఘోర పడవ(Boat Capsizes ) ప్రమాదం సంభవించింది. భీకర గాలుల వల్ల పడవ బోల్తా పడి 30 మంది(Nearly 30 Feared Dead) మరణించారు. మరో 40 మంది(40 passengers have been rescued )ని కోస్ట్గార్డ్ సిబ్బంది కాపాడారు. రైజాల్ ప్రావిన్సులో ఈ ఘోర ప్రమాదం( small boat capsized) జరిగింది. తెల్లవారుజాము ఒంటి గంటకు రిజాల్ ప్రావిన్స్ బినంగోనన్ పట్టణ సమీపంలోని లాగునా సరస్సులో పడవ ప్రయాణిస్తున్న సమయంలో భీకరమైన గాలులు వచ్చాయి. గాలులకు భయపడిన ప్రయాణికులు అందరూ బోటుకు ఒక వైపునకు చేరుకోవడంతో అది ఒక్కసారిగా బోల్తా పడింది.
పడవలో 70 మంది ప్రయాణిస్తుండగా అందులో 30 మంది మరణించారు. మరో 40 మందిని కోస్ట్గార్డ్ కాపాడింది. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై భిన్న స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com