అమెరికా కీలక నిర్ణయం
By - TV5 Telugu |3 Sep 2019 2:18 PM GMT
అప్ఘనిస్థాన్ లోని అమెరికా సైనికులను తొలగించనున్నట్లు యూఎస్ అధికారులు తెలిపారు. తాలిబన్ జరిగిన శాంతి చర్చల అనంతరం, ఒప్పందం ప్రకారం ఐదు బేస్ క్యాంప్ ల నుంచి 5వేలమంది సైనికులను 135 రోజుల్లో స్వదేశానికి పంపిస్తున్నట్లు అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ లోని వేర్పాటువాద నాయకులతో కొన్ని నెలలుగా జరుగుతున్న శాంతి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఒప్పందాలపై అమెరికా అధ్యక్షుడు, అఫ్గన్ ప్రధానమంత్రి సంతకాలు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అమెరికా, దాని మిత్రదేశాలపైతాలిబన్ దాడులను చేయకూడదనే ఒప్పందం ప్రకారం సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఖలీల్జాద్ తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com