Bangladesh News : భారీ రెస్టారెంట్‌లో మంటలు.. 44కి మందికిపైగా సజీవదహనం!

Bangladesh News : భారీ రెస్టారెంట్‌లో మంటలు.. 44కి మందికిపైగా సజీవదహనం!

Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాలోని ఏడు అంతస్తుల రెస్టారెంట్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ సంఘటనలో ఇప్పటి వరకు 44 మంది సజీవదహనం అయ్యారని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఢాకాలోని బెయిలీ రోడ్డులో ఓ బిర్యానీ రెస్టారెంట్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభివించిందని అగ్నిమాపక అధికారులు చెప్పారు. మంటలు కింద ఫ్లోర్ నుంచి పై బిల్డింగ్‌కు వేగంగా వ్యాపించాయి. వేగంగా విస్తరించడంతో అందులో ఉన్న వారు బయటకు రావడానికి వీలులేకుండా పోయిందన్నారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్‌ ఫోన్ల షాపులు ఉన్నాయని చెప్పారు. అయితే.. మంటలను త్వరగానే ఆపేయడం ద్వారా పక్కన ఉన్న వాటికి వ్యాపించలేదని చెప్పారు. కానీ.. దురదృష్టవశాత్తు రెస్టారెంట్‌లో 44 మంది చనిపోయినట్లు తెలిపారు.

మంటల్లో చిక్కుకుని మరో 30 మంది వరకు గాయాలపాలయ్యారు. ఇక అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 75 మందిని సురక్షితంగా కాపాడారు. అయితే.. రెస్టారెంట్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పొగకు ఊపిరాడక స్పృహకోల్పోయి మంటలకు ఆహుతైనవాళ్లే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story